బడ్జెట్ పై బీజేపీ ఎంపీలకు బ్రీఫింగ్

బడ్జెట్ పై బీజేపీ ఎంపీలకు బ్రీఫింగ్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. లోక్‌సభ లో ఐదోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని బాలయోగి ఆడిటోరియంలో రేపు ఉదయం 9 గంటలకు  బ్రీఫింగ్ ఉంటుందని బీజేపీ ఎంపీలందరికీ సమాచారం అందించారు.  సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించామని, దీనిని ఆయా నియోజకవర్గాలకు వెళ్లి సామాన్యులకు అర్థం అయ్యేలా  చెప్పాలని పార్టీ తన పార్లమెంటు సభ్యులందరినీ కోరిన తరుణంలో ఈ బ్రీఫింగ్ ను నిర్వహించనున్నారు. 

బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రూ.5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని రూ. రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.3 లక్షల వరకు  ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.  ఇన్ కంట్యాక్స్కు సంబంధించి 2020లో ప్రకటించిన 6 శ్లాబుల విధానంలోనూ కేంద్రం మార్పు చేసింది. ఇకపై 5 శ్లాబులు మాత్రమే కొనసాగుతాయని చెప్పారు. రూ.3 నుంచి 6 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 5శాతం, రూ.6 నుంచి 9 లక్షల వరకు 10శాతం,9 నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉంటే 15శాతం, రూ.12 నుంచి 15 లక్షల వరకు 20 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.15 లక్షల ఆదాయం దాటిన వారు 30శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. 

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *