హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. అదానీ వ్యవహారంలో రంగంలోకి ఆర్‌బీఐ.. ఏ బ్యాంక్ ఎంతెంత అప్పులిచ్చాయ్? ఏం జరగబోతోంది?

RBI: గౌతమ్ అదానీ (Gautam Adani).. కొద్దిరోజుల కిందటి వరకు ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న వ్యక్తి. దిగ్గజ కంపెనీ అదానీ గ్రూప్ అధినేతకు ఎదురేలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research).. సరిగ్గా వారం కిందట అదానీ గ్రూప్‌పై (Adani Group) సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్.. భారత స్టాక్ మార్కెట్లో తీవ్ర అవకతవకలకు పాల్పడుతోందని, కృత్రిమంగా షేర్ల విలువను పెంచుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని ఆరోపించింది. రెండేళ్ల పాటు పరిశోధన జరిపి.. దీనిపై పెద్ద రిపోర్ట్ విడుదల చేసింది. ఇక అక్కడి నుంచి అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ సగానికిపైగా పడిపోయింది.

సరిగ్గా వారంలో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 100 బిలియన్ డాలర్లకుపైగా పడిపోవడం గమనార్హం. ఇదే క్రమంలో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానం నుంచి ఏకంగా 17కు పడిపోయారు గౌతమ్ అదానీ. తాజాగా రూ. 20 వేల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా బరిలోకి వచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO ను కూడా అదానీ గ్రూప్ రద్దు చేసుకుంది. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు చెల్లించనుంది.

Adani: లక్షల కోట్లు నష్టం.. ‘అదానీ’కి తగిలిన 10 ఎదురుదెబ్బలు ఇవే..!

అయితే ఈ వ్యవహారం నేపథ్యంలో.. పెద్ద దుమారం చెలరేగుతున్న తరుణంలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్వయంగా రంగంలోకి దిగినట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా బ్యాంకులను.. అదానీకి ఇచ్చిన లోన్లు, ప్రస్తుత స్టేటస్ గురించి వెల్లడించాలని కోరినట్లు బ్యాంకింగ్ వర్గాలు కూడా వెల్లడించాయి.

ఇప్పటికే అదానీ గ్రూప్ సెక్యూరిటీస్‌పై మార్జిన్‌పై రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి స్విస్‌కు చెందిన క్రెడిట్ సూయిజీ, అమెరికాకు చెందిన సిటీ గ్రూప్. దీంతో ఇక అదానీ గ్రూప్ బాండ్లను హామీగా అంగీకరించబోవు. ఈ నేపథ్యంలోనే RBI కూడా బ్యాంకుల నుంచి వివరాలను కోరుతున్నట్లు సమాచారం.

అదానీ గ్రూప్ సంచలనం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు.. అసలేమైంది?

సాధారణంగా బ్యాంకులు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్లకు ఇచ్చే లోన్లకు సంబంధించిన వివరాలను RBI ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటుంది. ఇలాంటి సమయంలో కార్పొరేట్లకు రుణాలిచ్చే సమయంలో బ్యాంకులు.. ఆయా సంస్థల షేర్లను తనఖా పెట్టుకుంటాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ షేర్ల విలువ పతనం అవుతున్న సమయంలో ఆ తనఖా పెట్టుకున్న షేర్ల విలువ కూడా తగ్గిపోతుంది. ఇది బ్యాంక్ వ్యవస్థను మొత్తానికే ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉంటుంది.

ఏ బ్యాంకు దగ్గర ఎంత? ఏమంటున్నాయ్?

అదానీ గ్రూప్‌నకు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వలేదని ఇటీవల తెలిపిన బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. నగదు ద్వారా ఆస్తుల ద్వారా తమ రుణాలన్నీ పూర్తిగా హామీతో ఉన్నట్లు వివరించింది. SBI.. అదానీ గ్రూప్‌కు మొత్తం 2.6 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో ఇది రూ.21,300 కోట్లు రుణాలిచ్చినట్లు తెలిసింది.

ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా.. అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రూ.7 వేల కోట్ల అప్పులకు పూర్తి సెక్యూరిటీ ఉందని ప్రకటించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అదానీ గ్రూప్‌నకు అప్పులు ఇచ్చిన లిస్ట్‌లో ఉంది. ఏకంగా రూ.7 వేల కోట్ల రుణాలు ఇవ్వగా.. ఇందులో మూడొంతులు.. అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారానికి ఇచ్చినట్లు వెల్లడించింది.

మొత్తం అందుబాటులో ఉన్న రుణాల్లో 0.1 శాతం కంటే తక్కువే అదానీ గ్రూప్‌నకు ఇచ్చినట్లు తెలిపింది ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్. ఇక 0.5 శాతం రుణాలు ఇచ్చినట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ పేర్కొంది.

Budget 2023: కొత్తగా వందే మెట్రో సర్వీసులు.. బడ్జెట్‌లో కీలక ప్రకటన.. ఫీచర్లు ఇవే.. ఎక్కడెక్కడ వస్తాయంటే?

ఇక అదానీ గ్రూప్ కంపెనీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్లు LIC పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ సంస్థ కూడా స్పందించింది. అదానీ గ్రూప్‌లో తమ ఇన్వెస్ట్‌మెంట్లు మొత్తం రూ.36,474.78 కోట్లుగా ఉన్నట్లు.. ఇది తమ మొత్తం పెట్టుబడుల్లో ఒక శాతం కంటే తక్కువేనని వివరించింది.

Read Latest

Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read:

హిండెన్‌బర్గ్ రిపోర్ట్.. FPO రద్దు.. తొలిసారి నోరు విప్పిన గౌతమ్ అదానీ.. అసలేమైందో చెప్పేశారుగా!

రూ.60 వేల మార్క్‌కు తులం బంగారం ధర.. ఎక్కడెక్కడ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *