PM Modi Tweet: తెలంగాణపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి దక్కిందని బీఆర్ఎస్ నేతలు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైల్వే శాఖ ప్రకటించిన కొత్త ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందని ప్రధాని ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ రైల్వే ప్రాజెక్టు ఏంటి? ఆ రైల్వే ప్రాజెక్టు ఎక్కడ వస్తుంది? అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి నిరాశే ఎదురైందని విమర్శిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ ట్వీట్ చర్చనీయాంశం అయింది. ఈ ట్వీట్ లో ఏముందంటే ‘తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కర్ణాటక , మహారాష్ట్ర , తెలంగాణ ప్రజలకు అభినందనలు’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రైల్వే లైన్ల విద్యుద్దీకరణలో భాగంగా..పర్లి వైజనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుద్దీకరణ చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సాయంత్రం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *