చిన్నారి ప్రాణం తీసిన న్యుమోనియా చికిత్స

చిన్నారి ప్రాణం తీసిన న్యుమోనియా చికిత్స రోజుకో టెక్నాలజీ పుంతలు తొక్కుతున్నా కొన్ని మారుమూల గ్రామాల్లో మాత్రం ఆనాటి పరిస్థితులు ఇంకా మారడం లేదు. న్యుమోనియా చికిత్సలో భాగంగా అత్యంత ప్రమాదకరమైన వేడి రాడ్ లతో చేసే చికిత్స మరోసారి ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనలో న్యుమోనియా వచ్చిన 3 నెలల పాపను 51 సార్లు వేడి ఇనుప రాడ్ తో కొట్టినట్టు తెలుస్తోంది. ఈ పద్దతి అక్కడ సాధారణమే అయినప్పటికీ… అది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. అయితే అప్పటికే వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది అయింది.

ఆ తర్వాత ఆ పాప ఆరోగ్యం క్షీణించడంతో షాదోల్ లోని మెడికల్ కాలేజీకి పంపారు. కానీ వేడి ఇనుప రాడ్ తో కొట్టడం వల్ల అది జరిగిన 15 రోజుల్లోపే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ విషయం పోస్టు మార్టం రిపోర్ట్ లో వెల్లడి కావడంతో షాదోల్ కలెక్టర్ వందనా వైద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చిన్నారికి అది న్యుమోనియాకు చికిత్స చేయలేదని, అది ఆమె పరిస్థితిని మరింత దిగజార్చిందని తెలిపారు. అనంతకం స్థానిక అంగన్ వాడీ కార్యకర్త తన తల్లికి కౌన్సిలింగ్ చేసి, ఇలాంటి పనులు మరోసారి  చేయకూడదని హెచ్చరించినట్టు సమాచారం.

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *