తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ రెండు రోజులు జాగ్రత్త !

Telangana Weather Alert: తెలంగాణలో గత రెండు రోజులుగా చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ చలి ప్రభావం పెరిగింది. రోజు రోజుకూ రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొండ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తుంది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో శుక్రవారం 6.1 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత విపరీంతంగా పెరిగింది.ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోతున్నాయి. సంగారెడ్డిలో కనిష్టంగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 10.4, మెదక్ జిల్లాలో 11.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలకు అరెంజ్ అలెర్ట్, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు వాతవరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహన రాకపోకలు స్పష్టంగా కనిపించవని., అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని వాతవరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే ఉదయం వేళల్లో బయటకు వెళ్లాలని, వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని అధికారులు చెప్పారు.

Read More Telangana News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *