Nirmal Chicken Shop: సండే వచ్చిందంటే చాలు.. నాన్వెజ్ ప్రియులకు ముక్కలేనిదే ముద్ద దిగదు. మటన్, చికిన్, ఫిష్ ఇలా ఎదో అక నీచు పదార్థం ఉండాల్సిందే. కానీ గత కొద్దిరోజులుగా మాసం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. మటన్ కేజీ 800 పైనే ఉండగా.. చికెన్ రూ. 250 దాకా పలుకుతోంది. దీంతో అంతంత ధరలు పెట్టి మాసం తినేందుకు సామాన్యులు జంకుతున్నారు. ఆ పూటకు ఏదో అలా మక్క తిన్నంలే అన్నట్లుగా.. పావు కేజీతోనో, అర కేజీతోనే గడపిస్తున్నారు.
అలాంటి వారికి ఓ చికెన్ షాప్ యజమాని గుడ్ న్యూస్ చెప్పాడు. బంఫర్ ఆఫర్ ఇస్తూ.. కేవలం రూ. 99 కే కేజీ చికెన్ అందిస్తున్నాడు. దీంతో అతడి షాప్ ముందు జనం బారులు తీరుతున్నారు. అదేదో షాపు ప్రారంభ ఆఫర్ కింద ఒక్కరోజే అలా అమ్ముతున్నాడంటే పొరబడినట్లే. ఎందుకంటే.. అతడు ప్రతి రోజూ అదే ధరకు అమ్ముతున్నాడు. అదేక్కడో కూడా కాదు.. మన తెలంగాణలోనే.
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంలో ఉన్న భారత్ చికెన్ సెంటర్లో కిలో కోడి మాంసం రూ.99 కే అందిస్తున్నాడు షాప్ యజమాని మజ్జూ. ఇతర షాపులతో పోల్చితే.. సగం రేటుకు చికెన్ విక్రయిస్తున్నాడు. షాపు యజమాని ముజ్జూకు మెుత్తం మూడు కోళ్ల ఫారమ్లు ఉన్నాయట. కోళ్లను ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ చేయకుండా. తానే స్వయంగా చికెన్ షాపును నిర్వహిస్తున్నాడు. తమ ఫామ్లలో పెరిగే కోళ్లను.. తమ చికెన్ షాప్కే తరలించి మాంసంగా కట్ చేసి విక్రయిస్తున్నాడు.
ఇతర షాప్లతో పోల్చితే తమ దుకాణంలో అతి తక్కువ ధరకే చికెన్ లభిస్తుందని చికెన్ షాప్ యజమాని మజ్జూ తెలిపాడు. ఓపైపు చికెన్ ధరలు మండిపోతున్న తరుణంలో రూ.99 కే కేజీ చికెన్ లభిస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు భారీగా తరలివస్తు్న్నారు. చికెన్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడి మరీ చికెన్ తీసుకెళ్తున్నారు.
97600152
Read More Telangana News And Telugu News