కీసర ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘట్కేసర్ నుంచి వస్తున్న బెంజ్ కారు (AP 09 BU 0990) అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టి ఎదురుగా మీర్పేట్ నుంచి వస్తున్న మరో కారు (TS 05 UC 4666 )టాటా విస్టాను ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
©️ VIL Media Pvt Ltd.