నాందేడ్ గురుద్వారాలో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

నాందేడ్ గురుద్వారాలో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు మహారాష్ట్రలోని నాందేడ్‭లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్  గురుద్వారాలో  నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు మత గురువులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేయగా, సిక్కు మత గురువులు ఆయనకు అశీర్వచనలు అందించారు. సీఎం వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, రవీందర్ సింగ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎయిర్పోర్టు దగ్గర ముందుగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించి గురుద్వార్ చేరుకున్నారు. 

మరికాసేపట్లో నాందేడ్‭లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మహారాష్ట్రలో మొదటిసభ కావడంతో గులాబీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. స‌భా వేదిక‌పై కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన  ముఖ్యనేతలు బీఆర్ఎస్‭లో చేరనున్నారు. ఇక ఈ వేదిక నుంచే కేసీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *