ఏపీలో వచ్చే ఎన్నికలపై కేంద్ర మాజీ మంత్రి జోస్యం.. వైసీపీ ఎన్ని సీట్లొస్తాయో చెప్పారు

ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రజలు సంతోషంగా లేరని.. బటన్ నొక్కినంత మాత్రాన జగన్‌ను ప్రజలు నమ్మరన్నారు. తిరుపతి ఎస్‌బీఐ దగ్గర చింతామోహన్ నిరసనలు చేపట్టారు.. అక్కడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార వైఎస్సార్‌సీపీ ఉండలేక ఎమ్మెల్యేలే బయటకు వచ్చేస్తున్నారని.. మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వైఎస్సార్‌సీపీకి ఇరవై సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. జగన్ రాజధాని విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్నారని.. ప్రజలు ఆయన్ను విశ్వసించడం లేదన్నారు.

ఎస్‌బీఐ అదానీ రూ.30 వేల కోట్ల రుణాన్ని రాజకీయ పలుకుబడితో కట్టబెట్టిందని ఆరోపించారు మోహన్. దేశంలోని 24 వేల బ్రాంచ్‌లు ఉన్న ఎస్‌బీఐ దివాలా తీస్తోందని.. ఎస్‌బీఐని అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చాలని సెటైర్లు పేల్చారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని.. ఎల్ఐసీని కూడా అదానీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌గా మార్చాలన్నారు. ఇంటర్ చదివిన అదానీనికి ఎలాంటి షూరిటీ లేకుండానే రుణాన్ని ఇచ్చారని.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చింతా మోహన్.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *