గౌతమ్ అదానీ కంపెనీకి భారీ లాభం.. ఏకంగా 77 శాతం జంప్.. హిండెన్‌బర్గ్ దెబ్బకొట్టినా..!

Adani Transmission: దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ ట్రాన్స్‌మిషన్.. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. భారీ లాభాలను గడించడం విశేషం. ఏకీకృత ప్రాతిపదికన నికరలాభం 77.8 శాతం మేర పెరిగి రూ.474.72 కోట్లుగా నమోదైంది. అయితే సరిగ్గా ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.267.03 కోట్లుగా మాత్రమే ఉంది. ఇక ఆదాయం పరంగా చూస్తే గనుక 22 శాతం వృద్ధి చెందింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.3,551.7 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.2,911.7 కోట్లుగా నమోదైంది. ఈ మేరకు అదానీ ట్రాన్స్‌మిషన్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

అదానీ ట్రాన్స్‌మిషన్ EBITDA విషయానికి వస్తే కూడా భారీగా వృద్ధి చెందింది. మూడో త్రైమాసికంలో 64 శాతం పెరిగి రూ.1477.5 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ.900.9 కోట్లుగా ఉండేది. అయితే అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్ సోమవారం సెషన్‌లో 10 శాతం లోయర్‌సర్క్యూట్ కొట్టి రూ.1261.40 వద్ద సెషన్‌ను ముగించింది.

అదానీ ఇష్యూ ఒక కంపెనీ సమస్య.. భారత్‌పై దాడి కాదు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

అయితే అదానీ కంపెనీల్లో ఇవాళ్టి సెషన్‌లో అదానీ పోర్ట్స్ కాస్త సానుకూలంగా ట్రేడయింది. దాదాపు 9 శాతానికిపైగా పెరిగింది. ఇటీవల అదానీ పోర్ట్స్ 2023 జనవరిలో తన ఆపరేషనల్ పెర్ఫామెన్స్ గురించి ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నారు. దీంతో ఇదొక్క స్టాక్ పెరుగుతోంది. మరోవైపు అదానీ పవర్, అదానీ విల్మర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ స్టాక్స్ వరుసగా లోయర్ సర్క్యూట్‌లోనే లాకవుతున్నాయి. లోయర్ సర్క్యూట్ కొట్టడం అంటే.. ఆ స్టాక్ కొనేవారు ఎవరూ లేరన్నమాట.

ఈ కారు కోసం ఎగబడ్డ జనం.. కనీవిని ఎరగని రీతిలో రూ.88 కోట్లు.. ఒకే ఒక్క భారతీయుడి దగ్గర ఈ కాస్ట్‌లీ కారు..!

అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్.. అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తీవ్ర మోసాలకు పాల్పడుతోందని, స్టాక్ మానిపులేషన్ చేస్తోందని, అకౌంటింగ్ ఫ్రాడ్స్ జరుపుతోందని రిపోర్ట్ విడుదల చేసింది. రెండేళ్ల పాటు పరిశోధన చేసినట్లు హిండెన్‌బర్గ్ చెప్పుకొచ్చింది. ఇదే తరుణంలో 88 ప్రశ్నలను అదానీ గ్రూప్‌కు సంధించగా.. 2 రోజుల తర్వాత 413 పేజీల్లో తన రెస్పాన్స్ ఇచ్చింది అదానీ గ్రూప్. ఇది భారత దే

మధ్యలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లు పతనమైంది. ఇక అదానీ సంపద రూ.5 లక్షల కోట్లు పడిపోయి.. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-15లో చోటు కోల్పోయారు.

Read Latest

Business News and Telugu News

Also Read:

10 రోజుల్లో అదానీ గ్రూప్ కోల్పోయిన సంపద.. 80 కోట్ల మందికి ఐదేళ్లు ఫ్రీగా..!

97635797

97632214

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *