Forbes magazine: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాకిలేటి శివతేజ అనే యువకుడికి అరుదైన గుర్తింపు దక్కింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ.. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన టాప్ 30 యువ సాధకుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. గౌహతి ఐఐటీలో ఈసీఈ మేజరు డిగ్రీగా.. సీఎస్ఈ మైనర్ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశారు శివతేజ. Kakileti Siva teja ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్ అనే వైద్య సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని.. కొంతమంది భాగస్వామ్యంతో ప్రారంభించి.. రొమ్ము క్యాన్సర్ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నారు.
ఇందులో శివతేజ మెషీన్ లెర్నింగ్ టీమ్కు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ పరిశోధనలు చేస్తూనే నెదర్లాండ్స్లోని మాస్ట్రక్ట్ యూనివర్సిటీలో క్లినికల్ డేటా సైన్స్లో శివతేజ పీహెచ్డీ పూర్తి చేశారు. మెడికల్ ఇమేజింగ్లో ఏడేళ్ల పైబడి అనుభవం ఉన్న శివతేజ (Kakileti Siva teja) ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. శివతేజ చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్ పత్రిక.. యువ సాధకుల జాబితాలో స్థానం కల్పించింది. దీనిపై శివతేజ, అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Latest
Andhra Pradesh News
and