15 శాతం ఉద్యోగులకు లేఆఫ్.. వాళ్ల కోసం అన్నీ వదులుకున్న సీఈఓ.. గుడ్‌బై అంటూ భావోద్వేగం!

Zoom Layoffs: ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయం పడిపోతోంది. ఈ నేపథ్యంలో.. ఉద్యోగులు వణికిపోతున్నారు. ఉద్యోగం ఎప్పటివరకు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందోనని తెగ కంగారు పడిపోతున్నారు. ప్రస్తుతం ఆ భయాలు అలానే ఉన్నాయి మరి. దిగ్గజ కంపెనీలు కూడ పెద్ద ఎత్తున ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి అని సింపుల్‌గా చెప్పేసి లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే టెక్, ఐటీ రంగంలో లేఆఫ్స్ ఎలా ఉన్నాయో చూశాం. ఇటీవల అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా వేలల్లో ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. తర్వాత దేశీయంగా ఐటీ సంస్థలు విప్రో, ఇన్ఫోసిస్ వంటివి కూడా పెర్ఫామెన్స్ సరిగా లేదన్న కారణంతో వందల్లో ఉద్యోగులను తొలగించుకున్నాయి.

ఇప్పుడు దిగ్గజ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అందించే సంస్థ జూమ్ కూడా ఈ లేఆఫ్స్ కంపెనీల జాబితాలో చేరింది. తన వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం లేదా 1300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ ఎరిక్ యువాన్ మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్ చేశారు. కరోనా సమయంలో ఇంటి దగ్గర నుంచి పనిచేసేవారు ఎక్కువైన నేపథ్యంలో.. డిమాండ్‌కు తగ్గట్లుగా ఎక్కువ మందిని నియమించుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు తప్పట్లేదని వివరణ ఇచ్చారు. డిమాండ్‌ను అందుకోవడానికి 24 నెలల వ్యవధిలో ఉద్యోగుల్ని 3 రెట్లు ఎక్కువగా నియమించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఐటీ ఉద్యోగులకు అత్యంత చేదు అనుభవం.. 600 మందిని పీకేసిన ఇన్ఫోసిస్.. ఆ ఒక్క కారణంతో!

ఇప్పుడు కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని, ఇప్పట్లో అలా కొనసాగడం కష్టమని చెప్పిన ఎరిక్.. జూమ్ దీర్ఘకాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని వెల్లడించారు. కష్టపడి పనిచేస్తున్న, మంచి ప్రతిభ ఉన్న 1300 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. అంటూ భావోద్వేగ పూరిత లేఖ రాశారు. ఉద్యోగం కోల్పోయిన వారందరికీ మెయిల్స్ వస్తాయని, ఈ పద్ధతిలో సమాచారం అందిస్తున్నందుకు తనను క్షమించాలని కోరారు.

అదానీ ఇష్యూ ఒక కంపెనీ సమస్య.. భారత్‌పై దాడి కాదు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు.. సీఈఓ ఎరిక్ కంపెనీ ఖర్చును తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనంలో ఏకంగా 98 శాతం కోత విధించుకున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి జవాబుదారీగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, 2023లో కార్పొరేట్ బోనస్‌ను కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్స్ టీమ్ కూడా తమ కనీస వేతనాలను 20 శాతం మేర తగ్గించుకుంటున్నాయని అన్నారు. ఇక ఉద్యోగం కోల్పోయిన వారు యూఎస్‌లో ఉన్నట్లయితే వారికి 16 వారాల వేతనం, హెల్త్‌కేర్ కవరేజీ, యాన్యువల్ బోనస్ అందుతాయని చెప్పారు.

PF ఖాతాదారులకు అలర్ట్.. ఇవన్నీ అప్‌డేట్ చేశారా? మీ అనుమానాలన్నింటికి సమాధానాలివిగో..!

Read Latest

Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read:

వాట్సాప్‌లోనే సింపుల్‌గా Home Loan అప్లై చేసుకోండిలా.. బంపర్ ఆఫర్.. త్వరపడండి!

పెరుగుతున్న బంగారం ధరలు.. ఇప్పుడు కొనొచ్చా? హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే..

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *