Layoffs: టెక్ ఉద్యోగులకు అత్యంత క్లిష్టమైన సమయం ఇది. ఈ కొత్త ఏడాదిలోనే లక్ష మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దిగ్గజ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో సంస్థ చేరింది. యానిమేటింగ్ ప్రపంచంలో దిగ్గజ సంస్థ అయిన వాల్ట్ డిస్నీ కో. వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. 5.5 బిలియన్ డాలర్లను ఆదా చేసుకునేందుకు, ఆన్లైన్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకం చేసుకునేందుకంటూ సుమారు 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇది డిస్నీ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న 3.6 శాతం ఉద్యోగులుగా పేర్కొంది. ఈ ప్రకటన చేసిన తర్వాత డిస్నీ షేర్లు 4.7 శాతం వృద్ధితో 117.22 డాలర్లకు చేరుకోవటం గమనార్హం.
వ్యయ నియంత్రణ చర్యల్లో ముఖ్యంగా షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఇస్తామన్న హామీని నెరవేర్చడం, మౌస్ హౌస్ ఆన్లైన్ స్ట్రీమింగ్పై ఎక్కువగా ఖర్చు చేస్తుందన్న ఇన్వెస్టర్ నెల్సన్ పెల్ట్స్ ఆరోపణలను ఖండించేందుకు చేపట్టినట్లు పేర్కొంది డిస్నీ. తమ దృష్టికి తీసుకొచ్చి సమస్యలను డిస్నీ సవనియంగా వింటుందని పేర్కొన్నారు సంస్థ అధికార ప్రతినిధి. మరోవైపు.. మూడు విభాగాల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపింది డిస్నీ సంస్థ. సినిమానాలు, టెలివిజన్, ఆన్లైన్ స్ట్రీమింగ్ నిర్వహణ చేపట్టే ఎంటర్టైన్మెంట్, క్రీడలకు సంబంధించిన ఈఎస్పీఎన్, చివరగా.. డిస్నీ పార్కులు ఉన్నాయని తెలిపింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు వాల్ట్ డిస్నీ సీఈఓ బోబ్ ఇగెర్. స్ట్రీమింగ్ అనేది ఇప్పటికీ డిస్నీ టాప్ ప్రియారిటిగా పేర్కొన్నారు. ప్రధాన బ్రాండ్లు, ఫ్రాంచైజీలపైనే తమ ఫోకస్ ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. జనరల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను మరింత సాన బెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఐదేళ్లలో మూడోసారి..
సబ్స్క్రైబర్స్ గ్రోత్ తగ్గటం, స్ట్రీమింగ్ విభాగంలో కాంపిటీషన్ పెరిగిన క్రమంలో ఉద్యోగాల కోత విధిస్తున్న తొలి మీడియా కంపెనీ డిస్నీ. తొలిసారి డిస్నీ ప్లస్ స్ట్రీమింగ్ మీడియో యూనిట్ త్రైమాసిక ఫలితాల్లో ఆదాయం తగ్గినట్లు తెలిపింది. సుమారు 1 బిలియన్ డాలర్లు నష్టపోయింది. సేల్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఇతర ఆపరేటింగ్ ఖర్చుల్లో 2.5 బిలియన్ డాలర్లు తగ్గించుకోవాలని చూస్తున్నట్లు పేర్కొంది. నాన్ స్పోర్ట్స్ కంటెంట్ను తగ్గించుకోవడం ద్వారా మరో 3 బిలియన్ డాలర్లు కలిసివస్తుందని తెలిపింది. 2005 లో సీఈఓగా బోబ్ ఇగెర్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సంస్థలో కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. గడిచిన ఐదేళ్లలోనే డిస్నీ సంస్థల పునర్నిర్మానం చేపట్టడం ఇది మూడోసారి.
97730962
Read
Business News and Telugu News
పీఎం కిసాన్ అలర్ట్.. ఈ పని పూర్తి చేస్తేనే రైతులకు డబ్బులు.. రెండ్రోజులే గడువు!