తుర్కియే, సిరియాలలో 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. ఈ దశాబ్దంలోనే అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా చెబుతున్న దీని కారణంగా ఐదు వేల మందికిపైగా మరణించారు.
విధ్వంసకర భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తుర్కియే కూడా ఒకటి. 1939 నుంచి 1999 మధ్య ఐదు భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని కుదిపేశాయి.
1900 నుంచి నేటి వరకు ఇక్కడ 76 భూకంపాల కారణంగా 90,000 మంది మరణించారు. ఈ మరణాల్లో సగం 1939 నుంచి 1999 మధ్యే సంభవించాయి.
2021లో హైతీ (2,200 మరణాలు), 2018లో ఇండోనేసియా (4,300)లనూ ఇలాంటి భూకంపాలే కుదిపేశాయి. 2017లో ఇరాన్లో వచ్చిన భూకంపం కారణంగా 400 మందికిపైగా మరణించారు.
- తుర్కియే-సిరియా భూకంపం: 4,300 దాటిన మృతుల సంఖ్య… కొనసాగుతున్న సహాయక చర్యలు
- తుర్కియే-సిరియా- ‘గత 84 ఏళ్ళల్లో ఇదే అతి పెద్ద భూకంపం’ – అధ్యక్షుడు ఎర్దొవాన్, దాదాపు 2,000 మంది మృతి
అంచనాలతో
భూకంపాలు ఎక్కడెక్కడ వచ్చే ముప్పు ఉంటుందో మనం ముందుగానే అంచనా వేస్తున్నప్పటికీ, అవి ఎప్పుడు వస్తాయో కచ్చితంగా చెప్పడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. అసలు ముందుగా మనం కనిపెట్టలేమా?
‘‘దురదృష్టవశాత్తు కచ్చితంగా కనిపెట్టలేమనే చెప్పాలి’’అని ఇంపీరియల్ కాలేజీ లండన్కు చెందిన సైస్మాలజిస్టు డాక్టర్ స్టీఫెన్ హిక్స్ చెప్పారు.
‘‘కానీ, అంచనాలు వెల్లడించగలం. ఇప్పుడు వచ్చే అవకాశముందని అంచనా వేయగలం. అమెరికాలోని కాలిఫోర్నియా, జపాన్లలో ఈ అంచనాలు నానాటికీ మెరుగవుతున్నాయి’’అని ఆయన చెప్పారు.
భూకంపాల నుంచి ప్రాణాలతో బయట పడాలంటే ఏం చేయాలి?
- జోషీమఠ్- భూమి కుంగిపోతూ, ఇళ్ళు బీటలు వారుతున్న చోట ప్రజలు ఎలా జీవిస్తున్నారు- – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- జోషీమఠ్– 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్లు కుంగిన నేల.. ఇస్రో శాటిలైట్ సమాచారం వెల్లడి
సిద్ధంగా ఉండాలి..
భూకంపం ఎప్పుడు వస్తుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టం అవుతుండటంతో మనం అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
‘‘భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో మీరు జీవిస్తే, ‘ఎమర్జెన్సీ ప్యాక్’ను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది’’అని హిక్స్ సూచించారు. ఎమర్జెన్సీ ప్యాక్లో మంచినీళ్లు, ఒక టార్చ్లైట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆహారం ఉంచుకోవాలని చెప్పారు.
ఆ కిట్లో కొంత డబ్బు, ఔషధాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా పెట్టుకోవాలని రెడ్ క్రాస్ సూచిస్తోంది.
- అఫ్గానిస్తాన్: వందల కొద్దీ భూకంపాలు, గత పదేళ్లలో 7 వేల మరణాలు… ఈ ప్రాంతంలోనే ఎందుకిలా?
- సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలుడును శాటిలైట్లు ఎలా గుర్తించగలిగాయి?
సురక్షితమైన చోటు అయితే, అక్కడే ఉండండి..
భూకంపం వచ్చినప్పుడు ఉన్నచోటే కదలకుండా ఉంటే గాయాల పాలయ్యే అవకాశం తక్కువని అమెరికా జియోలాజికల్ సర్వే సూచిస్తోంది. ‘‘భూకంపం వచ్చినప్పుడు బయటకు పరిగెత్తడం, లేదా వేరే గదుల్లోకి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లడం లాంటివి చేయకూడదు’’అని సంస్థ సూచిస్తోంది.
‘‘కాళ్లు చేతులు దగ్గరకు ముడుచుకొని టేబుల్ లేదా డెస్కు కిందకు వెళ్లి తలదాచుకోవాలి. అప్పుడే పైనుంచి పడే వస్తువుల వల్ల మనకు గాయాలు కాకుండా ఉంటాయి. ప్రకంపనలు ఆగేవరకు టేబుల్ కాళ్లను గట్టిగా పట్టుకొని అక్కడే కదలకుండా కూర్చోవాలి’’అని సంస్థ సూచిస్తోంది.
కొంతమంది ఇంటి ప్రవేశ మార్గం, ద్వారాలు చాలా గట్టిగా ఉంటాయని, అక్కడకు వెళ్లి నిలబడాలని సూచిస్తుంటారు. అయితే, టేబుల్ కిందే సురక్షితంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి ముందు అందంగా అలంకరించే అద్దాలు, కిటికీలే ముందుగా భూకంప సమయంలో ధ్వంసం అవుతాయి. ఇలాంటి ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
- పాకిస్తాన్లో భూకంపం – 20 మంది మృతి
- హైతీ: కరిబియన్ దీవిలో తీవ్ర భూకంపం.. 1297 మంది మృతి
అప్పుడే బయటకు వెళ్లండి
మీరు నివసించే భవనం దెబ్బతినే పరిస్థితుల్లో ఉంటే, ప్రకంపనలు ఆగిన వెంటనే, బయటకు వెళ్లిపోతే మంచిది.
అయితే, ఇవన్నీ భూకంపం వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉంటే అనుసరించాల్సిన సూచనలు. ఒకవేళ మీరు బయట ఉంటే?
‘‘ఉన్నచోటే ఉండండి’’అని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘భవనాలు, విద్యుత్ స్తంభాలు, చమురు, గ్యాస్ లైన్ల’’కు కాస్త దూరంగా వెళ్తే గాయాలయ్యే అవకాశం తగ్గుతుంది. చెట్లు, ఫోన్ స్తంభాలు, భవనాలు లేని బహిరంగ ప్రాంతానికి వెళ్తే మీరు సురక్షితంగా ఉంటారు.
- అలల అద్భుతం
- నడి సముద్రంలో దీపావళి!
ముప్పులకు దూరంగా ఉండండి..
భూకంప సమయంలో ఎక్కువ మరణాలకు పైనుంచి పడిపోవడం, లేదా టీవీలు, బుక్ కేస్లు లాంటివి పైనపడటం వల్లే సంభవిస్తున్నాయని ఎర్త్క్వేక్ కంట్రీ అలయన్స్ చెబుతోంది. గోడలపై అమర్చే భారీ వస్తువులు కదిలేందుకు వీలుగా ఫ్లెక్సిబుల్ స్ట్రాప్స్తో అమరిస్తే కొంతవరకు ఇవి కిందపడే ముప్పు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
భూకంపం వల్ల గ్యాస్ పైప్లైన్లు దెబ్బతిని అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి.
1906లో శాన్ఫ్రాన్సిస్కో భూకంప సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని హిక్స్ చెప్పారు.
‘‘ఆ భూకంపంలో 3,000 మందికిపైగా మరణించారు. వీటిలో ఎక్కువ మరణాలకు గ్యాస్ పైప్లైన్లు పేలిపోవడమే కారణం. అందుకే ఇలాంటి విస్పోటం చెందే ప్రాంతాలకు మనం దూరంగా ఉండాలి’’అని ఆయన సూచించారు.
- చెత్త చూసి ఉంటారు, చెత్త సముద్రాన్ని ఎపుడైనా చూశారా!
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
డ్రిల్స్ ముఖ్యం..
భూకంపం వస్తే ఎలా స్పందించాలో ముందుగా సిద్ధంచేసే డ్రిల్స్తోనూ ప్రయోజనం ఉంటుందని హిక్స్ చెప్పారు.
‘‘కొన్ని దేశాల్లో ఎర్త్క్వేక్ డ్రిల్స్ నిర్వహించడం తప్పనిసరి. నాకు తెలిసి తుర్కియేలో ఇలాంటి ఏర్పాట్లు లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ భారీ భూకంపాలు రాలేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- తుర్కియే-సిరియా భూకంపం: 4,300 దాటిన మృతుల సంఖ్య… కొనసాగుతున్న సహాయక చర్యలు
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- తుర్కియే-సిరియా- ‘గత 84 ఏళ్ళల్లో ఇదే అతి పెద్ద భూకంపం’ – అధ్యక్షుడు ఎర్దొవాన్, దాదాపు 2,000 మంది మృతి
- బంగ్లాదేశ్: ఒకే రాత్రి 12 హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం… ఏమిటీ కథ?
(బీబీసీ తెలుగును , , లో ఫాలో అవ్వండి. లో సబ్స్క్రైబ్ చేయండి.)