Tourism Department: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా వివాదంలో చిక్కుకున్నారు. టూరిజం మంత్రి సూర్యలంక బీచ్ను సందర్శించిన సమయంలో.. చెప్పులు ఒడ్డున విడిచారు. సముద్రపు నీటిలోకి వెళ్లారు. వెళుతూ.. వెళుతూ.. ఓ వ్యక్తి చెప్పులు చూడూ అని చెప్పారు. అయితే.. చెప్పులు ఒడ్డును వదిలిపెట్టకుండా పర్యాటక శాఖ ఉద్యోగి నాగరాజు చేతిలో పట్టుకున్నారు. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. నాగరాజు చెప్పులు మోస్తూ మీడియా కంటపడ్డారు. ఆయన చెప్పులు మోస్తూ ఒడ్డున ఉంటే.. మంత్రి రోజా (RK Roja) సముద్రపు అలలను ఆస్వాదిస్తూ తిరిగారు. ప్రస్తుతం చెప్పులు మోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు.. చెప్పులు పట్టుకున్న నాగరాజు.. సూర్యలంక రిసార్ట్స్లో ఉద్యోగిగా పని చేస్తున్నారని సమాచారం.
97780927
Read Latest
Andhra Pradesh News
and