నాగ్‌పూర్ టెస్టులో శతకం బాదిన రోహిత్ శర్మ.. ఆధిక్యంలోకి భారత్

Rohit Sharma Test century: ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ శుక్రవారం శతకంతో చెలరేగాడు. మ్యాచ్‌లో 171 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 100 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో రోహిత్ శర్మకి ఇది 9వ సెంచరీ. హిట్‌మ్యాన్ శతకం బాదడంతో భారత్ జట్టు 64 ఓవర్లు ముగిసే సమయానికి 182/5తో నిలవగా.. 5 పరుగుల ఆధిక్యం లభించింది. గురువారం 177 పరుగులకి ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌటైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *