సమాజంలో సోషల్ మీడియాకు ప్రాధాన్యం పెరిగింది. అమాయకుల్ని మాయ మాటలతో ఈజీగా మోసం చేస్తున్నారు. ఈ ట్రాప్లో పడి కొందరు మహిళలు మోసపోయారు. ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ ఇలా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో ట్రాప్ చేస్తున్నాడు.. చాలామందిని బ్లాక్ మెయిల్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.
తెలంగాణ యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన నాగరాజు అనే యువకుడు ఖాళీగా ఉంటున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశ మొదలైంది. ఇంకేముంది డబ్బుల కోసం మహిళలకు మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుంటాడు. ఫేస్ బుక్లో పరిచయాలు పెంచుకుని వారిని ట్రాప్ చేస్తాడు.. వారితో మాటలు కలిపి వారి గురించి తెలుసుకుంటాడు. ఆ వెంటనే బ్లాక్ మెయిల్ మొదలు పెడతాడు. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు.
ఈ క్రమంలో ఏలూరుకు చెందిన ఓ వివాహితతో అతడు ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను వేధిస్తున్నాడు.. అక్కడితో ఆగకుండా అసభ్యకర పోస్టింగులు, మెసేజ్లు పెడుతున్నాడు. ఆమెను డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో.. ఆమె కూడా భయపడి అతడి అకౌంట్లో డబ్బులు జమ చేసింది. ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేయడంతో బాధితులురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతడ్ని ప్రశ్నిస్తే.. గతంలో ముగ్గురు అమ్మాయిలను ఇలానే వేధించినట్లు తేలింది. వారి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
Read Latest
Andhra Pradesh News
and