రవీంద్ర జడేజాకి జరిమానా.. అంపైర్ పర్మీషన్ తీసుకోనందుకు శిక్ష!

భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి జరిమానా పడింది. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ అనుమతి తీసుకోకుండా జడేజా తన వేలికి క్రీమ్ రాసుకుని రూల్స్‌ని బ్రేక్ చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తేల్చింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ నాగ్‌పూర్ టెస్టులో రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్ 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. అలానే బ్యాటింగ్‌లోనూ 185 బంతుల్లో 9×4 సాయంతో 70 పరుగులు చేశాడు.

అసలు ఏంటి ఈ వివాదం అంటే? గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు రవీంద్ర జడేజా బౌలింగ్ మధ్యలో ఓసారి తన ఎడమచేతి చూపుడు వేలికి క్రీమ్ రాసుకుంటూ కనిపించాడు. మహ్మద్ సిరాజ్ తన చేతిపై ఆ క్రీమ్‌ని రాసుకుని మైదానంలోకి రాగా.. జడేజా ఆ క్రీమ్‌ని తీసుకుని వేలికి రాసుకుని అనంతరం బౌలింగ్ చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో రవీంద్ర జడేజా బాల్ లాంపరింగ్‌కి పాల్పడ్డాడంటూ ఆరోపణలు వినిపించాయి. కానీ అది పెయిన్ రిలీఫ్ క్రీమ్ అని టీమిండియా మేనేజ్‌మెంట్ స్వయంగా మ్యాచ్ రిఫరీకి వివరణ ఇచ్చింది. దాంతో వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు.

నాగ్‌పూర్ టెస్టు మ్యాచ్ శనివారం ముగియగా.. భారత్ జట్టు ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన నిమిషాల్లోనే జడేజా మ్యాచ్ ఫీజులో 25% కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనని విడుదల చేసింది. దానికి కారణం జడేజా మైదానంలో క్రీమ్‌ని రాసుకునే ముందు ఫీల్డ్ అంపైర్ల నుంచి అనుమతి తీసుకోలేదని.. ఇది కచ్చితంగా ఐసీసీ నియమ నిబంధనల్ని ఉల్లంఘించడమేనని ఐసీసీ తేల్చింది. ఈ మేరకు పనిష్మెంట్ విధించింది.

రవీంద్ర జడేజా మ్యాచ్ ఫీజులో 25% కోతతో పాటు అతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ని కూడా ఐసీసీ చేర్చింది. గత రెండేళ్లలో జడేజా ఖాతాలో చేరిన తొలి డీమెరిట్ పాయింట్ ఇది. ఒకవేళ జడేజా ఫీల్డ్ అంపైర్ల నుంచి అనుమతి తీసుకుని ఉండింటే? అసలు ఏ సమస్యే ఉండేది కాదు. మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం గమనార్హం.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *