Formula E Race: హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ జరిగితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేసర్లు వచ్చి పాల్గొన్నారు. ఆ రేస్ చూడటానికి వేల రూపాయలు టికెట్ ధర పెట్టినా.. వీక్షకులు పోటెత్తారు. ఇలాంటి ప్రముఖ రేస్ నిర్వహణ కోసం తోడ్పాటు అందించి, చొరవ చూపిన తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాలి. దీని విజయవంతం కోసం పనిచేసి హైదరాబాద్ (Hyderabad) పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను కొనియాడాలి. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ఫార్ములా ఈ రేస్ సక్సెస్ తర్వాత నారా చంద్రబాబునాయుడు పేరు తెరపైకి వచ్చింది.
‘1995-2004 మధ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ఈ క్రీడ ఔన్నత్యాన్ని గుర్తించారు. దాని వల్ల టూరిజం అభివృద్ధి జరుగుతుందని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని.. తద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని సంకల్పించారు. రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు పెంచాలనే విజన్తో యూరప్ పర్యటనకు వెళ్లారు. అప్పట్లో ఫార్ములా వన్ ఛాంపియన్గా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న మైఖేల్ షుమాకర్ని కలిశారు. ఆయన ద్వారా ఫార్ములా వన్ నిర్వాహకులను కలిసి.. హైదరాబాద్లో ఉండే అవకాశాలను వివరించారు. హైదరాబాద్లో ఫార్ములా వన్ రేస్ శాశ్వత ప్రాతిపదికన నిర్వహణకు ఒప్పించారు’ అని టీడీపీ నేతలు చెబుతున్నారు.
‘ఫార్ములా వన్ రేస్ నిర్వహణ కోసం.. రంగారెడ్డి జిల్లాలో 3 వేల ఎకరాలు భూమి కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా.. పరోక్షంగా లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేశారు. టూరిజం.. హాస్పిటాలిటీ రంగాలు కొత్త పుంతలు తొక్కడం ఖాయమని అంచనా వేశారు. అదే సుసాధ్యం అయిఉంటే ఇటు చేవెళ్ల నుంచి అటు షాద్నగర్ వరకు.. ఎంతో అభివృద్ధి అయ్యేది. కానీ.. అది వాస్తవ రూపంలో అమలులోకి వచ్చేలోపే సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పుడు చంద్రబాబు ఓడిపోయారు. వైఎస్సార్ గెలిచారు. ఆ తర్వాత ఆయన ఆ భూకేటాయింపును రద్దు చేశారు. కానీ.. 20 ఏళ్ల తర్వాత.. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ జరిగింది’ అని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు.
Read Latest
Andhra Pradesh News
and