Mahashivratri 2023 మహా శివరాత్రి పండుగ రోజున శివుని పూజా విధానం గురించి శివ పురాణంలో పూర్తిగా వివరించబడింది. ఈసారి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది.
Mahashivratri 2023 హిందూ మత విశ్వాసాల ప్రకారం, శివ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ సంతోషకరమైన జీవితం కోసం శివ పురాణంలో అనేక విషయాలు పేర్కొనబడ్డాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే గ్రహాల పరిస్థితి ప్రతికూలంగా ఉంటుందో వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ శివ పురాణంలో నివారణ చర్యలు ఉన్నాయి. శివ పురాణం ప్రకారం, పరమేశ్వరుడిని ఆరాధించే వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. భోళా శంకరుడు తన భక్తులపై ఎల్లవేళలా ఆశీస్సులు కురిపిస్తూనే ఉంటాడు. శివ పురాణంలో, మహాదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు, సమస్యల నుంచి బయటపడేందుకు అనేక నివారణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి వచ్చే ఫిబ్రవరి 18వ తేదీన మహా శివరాత్రి రోజున శివపురాణంలో చెప్పిన కొన్ని పరిహారాలను పాటించండి.. సంపదను, ఐశ్వర్యాన్ని పెంచుకోండి.. ఆర్థిక సంక్షోభం నుంచి వెంటనే బయటపడండి…
శివలింగానికి అభిషేకం ఇలా..
మహా శివరాత్రి రోజున గంగాజలం, నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇదే సమయంలో ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం తొలగిపోవడంతో పాటు ఉద్యోగులకు, వ్యాపారులకు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీ పెండింగ్ పనులు కూడా తిరిగి ప్రారంభిస్తారు. మీకు రహస్య శత్రువుల నుంచి ముప్పు తొలగిపోతుంది.
Mahashivratri 2023 మహా శివరాత్రి వేళ జాగరణ, ఉపవాస వ్రతం ఎందుకు ఆచరిస్తారు…
ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు..
ఆర్థిక పరమైన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో.. వారందరూ సోమవారం రోజున ఇలాంటి పరిహారాలను పాటించాలి. మీరు నివసించే ప్రాంతంలో సాయంకాలం సంధ్యా వేళలో శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివ లింగం దగ్గర నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి. ఈ పరిహారాన్ని ఒక సోమవారం ప్రారంభించి 41 సోమవారాల పాటు దీపారాధన చేయాలి. ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మహిళలు రుతుక్రమం సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదని గుర్తుంచుకోండి. రుతుక్రమం ముగిసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి.
గోధుమలు, బార్లీతో ఈ పరిహారాలు..
శివ పురాణం ప్రకారం, గోధుమలు, బార్లీ చాలా పవిత్రమైనవి. పరమేశ్వరుని పూజలో ఇవి అత్యంత కీలకమైనవిగా పరిగణించబడ్డాయి. నీటిలో బార్లీని కలిపి శివలింగానికి సమర్పించడం వల్ల మీకు భౌతిక సంతోషం కలుగుతుంది. మీ పూర్వీకులు కూడా సంతోషిస్తారు. మహా శివరాత్రి రోజున గోధుమలు దానం చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది. గోధుమలతో చేసిన వంటకాలు కూడా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవని నమ్ముతారు. మహా శివరాత్రి రోజున గోధుమలతో ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో ఆనందం, సామరస్యం పెరుగుతుంది.
దీపం వెలిగించాలి..
మహా శివరాత్రి పర్వదినాన శివ లింగం దగ్గర దీపం వెలిగించడం వల్ల తమ జీవితంలో నెలకొన్న చీకట్లన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. శివలింగం దగ్గర ప్రతిరోజూ రాత్రి తొలి భాగంలో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో చీకటి తొలగిపోతుందని శివ పురాణంలో పేర్కొనబడింది. అంతేకాదు లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ పరిహారంతో కుభేరుడు కూడా సంతోషిస్తాడు.
శివ లింగానికి..
శివ పురాణం ప్రకారం, మహా శివరాత్రి రోజున మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని(పొడిగా ఉన్నది కాకుండా) ముద్దగా ఉండే అన్నం పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. శివలింగంపై ఏదైనా తెల్లని గుడ్డ కట్టి దానిపై అన్నం పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక పరమైన విషయాల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈసారి శనివారం రోజున అంటే ప్రదోషవ్రతం కూడా వచ్చింది. కాబట్టి శని దోషంతో బాధపడే వారు కూడా ఈ పరిహారాన్ని పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక
: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Read
Latest Astrology News
and