ఏపీలోని ఇంటర్ కాలేజీలకు బోర్డు హెచ్చరిక.. ఈ నంబర్ కు ఫిర్యాదు చేయాలని స్టూడెంట్స్ కు సూచన

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. నిబంధనల ప్రకారం హాజరు కలిగి ఉన్న విద్యార్థులందరికీ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అందించాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ కు స్పష్టం చేసింది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఏ కాలేజీ/యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు తమని సంప్రదించాలని బోర్డు సూచించింది. 1800 425 7635 టోల్ ఫ్రీ నంబర్ ను అన్ని పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించింది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *