Tadepalle:ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. Chaganti Koteswara Rao ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారి తనను కలిసిన చాగంటిని సీఎం జగన్ సత్కరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు.
జగన్తో సమావేశం అనంతరం.. సీఎం నివాస ప్రాంగణంలో ఉన్న గోశాలను చాగంటి కోటేశ్వరరావు సందర్శించారు. గోశాలను ఆసాంతం పరిశీలించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని సీఎం జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు. చాగంటి కోటేశ్వరరావు వెంట శాంతా బయోటెక్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా సీఎం జగన్తో భేటీ అయ్యారు.
డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనకర్తగా సుపరిచితులు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలాకాలంగా కృషి చేస్తున్నారు. తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో టీటీడీ ఆయనకు కీలక బాధ్యత అప్పగించింది. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది. ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించడం ఇదే తొలిసారి. టీటీడీకి సంబంధించి ఇది అత్యుత్తమ పదవి కావడం గమనార్హం.
డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు.. అష్ఠాదశ పురాణాలను అధ్యయనం చేశారు. సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలు చెబుతుంటారు. ప్రవచనాలను అలవోకగా వివరించగల సత్తా ఆయన సొంతం. హైందవ ధర్మ వ్యాప్తికి తన పరిధి మేర కృషి చేస్తుంటారు. కొంతమంది ఆయన్ను వ్యతిరేకించినా.. తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించి.. కీలక బాధ్యతలను అప్పగించింది.
Read Latest
Andhra Pradesh News
and