ఆరోగ్యశ్రీ చైర్మన్గా సుధాకర్రావు హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత, డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్రావును సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేండ్లపాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి యతిరాజారావు కుమారుడైన డాక్టర్సుధాకర్రావు1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1999లో చెన్నూరు (ప్రస్తుత పాలకుర్తి) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2010లో బీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో పాలకుర్తి టికెట్దయాకర్రావుకు ఇచ్చినప్పుడే సుధాకర్రావుకు కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఆరోగ్య శ్రీ ట్రస్ట్చైర్మన్గా నియమించారు.
©️ VIL Media Pvt Ltd.