ఐటీనే దెబ్బకొట్టింది.. ఇప్పుడు ఆ ఉద్యోగాలకు తెగ డిమాండ్.. ఇవి నేర్చుకుంటే చాలు!

IT Sector: ఈ ఏడాది ఐటీ రంగానికి అంతలా కలిసిరాలేదు. చాలా దిగ్గజ కంపెనీలు నిరాశాజనక ఫలితాల్ని ప్రకటించాయి. లాభాదాయాల్లో అంచనాలను అందుకోలేదు. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలకు అంతలా ప్రాజెక్టులు కూడా రాలేదు. ఇదే క్రమంలో ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో పాటు.. కొత్త ఉద్యోగుల నియామకాలకు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇదే క్రమంలో బెంగళూరు మహానగరంలో ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకాలు తగ్గడంతో.. మొత్తం ఫ్రెషర్స్ నియామకాలు కూడా గతేడాదితో పోలిస్తే తగ్గాయి. ఇక ఇప్పుడు తొలి అర్ధభాగంతో పోలిస్తే.. సెకండ్ హాఫ్‌లో వీరికి డిమాండ్ మరింత పడిపోనుందని అంచనా వేసింది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టీమ్‌లీజ్ గ్రూప్ టీమ్‌లీజ్ ఎడ్‌టెక్.

ఈ సర్వే ప్రకారం.. బెంగళూరులోని కంపెనీలు 65 శాతం వరకు ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఫ్రెషర్లను నియమించుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే తొలి అర్ధభాగంలో ఇది 75 శాతంగా ఉండగా.. 10 శాతం తగ్గిపోయింది. ముఖ్యంగా ఐటీ రంగంలో నియామకాలు లేకపోవడమే దీనికి కారణమని వెల్లడించింది. స్టాఫింగ్ ఫర్మ్ Xpheno డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దిగ్గజ ఐటీ కంపెనీలు మొత్తం నియామకాలను 40 శాతం తగ్గించుకుంటాయని తెలిసింది. ఇదే మొత్తం ఫ్రెషర్ల నియామకాలపై ప్రభావం చూపిస్తుందని ఎడ్‌టెక్ సంస్థ వెల్లడించింది.

ఇన్ఫోసిస్‌కు మరో బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 19 వేల కోట్ల డీల్ పట్టేసిందిగా.. ఇంకేం తిరుగులేదా?

గతేడాదితో పోలిస్తే కూడా ఫ్రెషర్ల నియామకాల్లో బెంగళూరులో క్షీణత కనిపిస్తోంది. గతేడాది ఫ్రెషర్లను నియమించుకున్న కంపెనీల సంఖ్య 68 శాతంగా ఉంది. అయితే బెంగళూరు ఇప్పటికీ దేశంలో ఫ్రెషర్ల నియామకాల్లో తొలి స్థానంలోనే ఉంది. ముంబయి 61 శాతం, చెన్నై 47 శాతంతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

రెండో అర్ధభాగంలో బెంగళూరులో మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలు,, కంపెనీలు నియమించుకోవాలనుకుంటున్న ఉద్యోగుల లిస్ట్‌ కూడా విడుదల చేసింది టీమ్‌లీజ్. ఎంబెడెడ్ ఇంజినీర్లు (65 శాతం), మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ (56 శాతం), జూనియర్ SCM అనలిస్ట్ (43 శాతం), అప్లికేషన్ ఇంజినీర్ (55 శాతం) వంటి ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉందని తెలిపింది.

బెంగళూరులోని 9 శాతం వరకు కంపెనీలు .. డిగ్రీ చదివిన వారికి కూడా ఉద్యోగులు ఇవ్వనున్నట్లు తెలిసింది. చెన్నై, పుణెలో ఇది 10 శాతంగా ఉంది. డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్ వంటి సర్టిఫికెట్లు ఉంటే.. ఫ్రెషర్లను ఎక్కువగా నియమించుకునేందుకు అవకాశాలు ఉంటాయట. ఇది ఉన్నత విద్యాసంస్థలకు, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్లకు కొత్త కోర్సుల్ని పరిచయం చేసే అవకాశం కూడా కల్పిస్తుందని చెప్పుకొచ్చింది.

రూ.8.50 లక్షల కోట్లు విరాళం.. అంబానీ, రతన్ టాటా, ప్రేమ్‌జీ ఏం కాదు.. మరెవరీ భారతీయుడు?

యూట్యూబ్‌లో మీకు పదే పదే ఆ వీడియోలు కనిపిస్తున్నాయా? వీటిని ఆపేదెలా..

Read Latest

Business News and Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *