చంద్రబాబుపై ప్రశ్నల వర్షం.. జైలుకెళ్లిన సీఐడీ అధికారులు, బాబు ఇద్దరు లాయర్లు వీరే!

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభమైంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోని కాన్ఫరెన్స్ హాల్లో సీఐడీ అధికారుల టీమ్ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. సీఐడీ డిఎస్పీ, కేసు ఇన్విస్టిగేషన్ అధికారి ధనుంజయ నేతృత్వంలో చంద్రబాబుని అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. విచారణలో 9 మంది సీఐడీ అధికారులు, సిబ్బంధి, ఇద్దరు మద్యవర్తులు.. ఒక ఫొటోగ్రాఫర్ ఉన్నారు. రెండు టీమ్‌లుగా చంద్రబాబుని ప్రశ్నిస్తారు. కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో ఒక్కో టీంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఉన్నారు.

విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు ఆదేశాలకి అనుగుణంగా సీఐడీ బృందం విచారణ చేయనుంది. చంద్రబాబు సమాధానాలని స్టేట్ మెంట్ రూపంలో రికార్డు చేయడానికి ల్యాప్ ట్యాప్.. ప్రింటర్లు తీసుకెళ్లారు. చంద్రబాబు విచారణని వీడియో తీయనున్నారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. విచారణలో ప్రతీ గంటకి ఐదు నిమిషాల పాటు బ్రేక్ ఉంటుంది.. చంద్రబాబు తరపున లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

సీఐడీ విచారణ సమయంలో చంద్రబాబు దగ్గర ఉండకూడదని చంద్రబాబు న్యాయవాదికి కోర్టు ఆదేశించింది. విచారణ మధ్యలో ప్రతీ గంటకి ఐదు నిమిషాల బ్రేక్ సమయంలో మాత్రమే తన న్యాయవాదితో మాట్లాడేందుకు చంద్రబాబుకి అనుమతి ఇచ్చారు. చంద్రబాబుకి అవసరమైన మందులు ఇవ్వడానికి ఏసీబీ కోర్టు ఓకే చెప్పింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో గంటపాటు లంచ్ బ్రేక్ కి అనుమతి ఇచ్చారు.

సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో బృందం :-

వి.విజయ్‌భాస్కర్,

ఎ.లక్ష్మీనారాయణ,

మోహన్‌కుమార్,

వై.రవికుమార్,

శ్రీనివాసన్,

సీహెచ్.సాంబశివరావు,

పి.రంగనాయకులు,

ఎం.సత్యనారాయణ

అంతేకాదు సీబీఐ కోర్టు మరికొన్ని ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించరాదని.. ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొన్నారు. జైలు పరిసర ప్రాంతాల్లో రెండంచెల భారీ బందోస్తును అధికారులు ఏర్పాటు చేశారు అధికారులు. ముందస్తు జాగ్రత్తగా రెండు అంబులెన్సులు సైతం జైలు లోపల సిద్ధంగా ఉంచారు. అలాగే డాక్టర్లు టీమ్‌ను కూడా సిద్ధం చేశారు. చంద్రబాబు రిమాండ్‌ను కోర్టు రెండు రోజులు (ఆదివారం) వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఆయన్ను వర్చువల్ ద్వారా కోర్టుకు హాజరుపర్చనున్నారు.

  • Read More Andhra Pradesh News And Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *